Friday, May 3, 2024

సీఎం జగన్‌పై కేంద్ర మంత్రి ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమున్న లక్షణమైన నాయకులని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విశాఖపట్నంలోని 1000 పడకల జంబో కరోనా ఆస్పత్రిని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఏపీ ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి రెండో టర్మ్‌లో రెండేళ్లు పూర్తి చేసుకుంటే.. తొలిసారి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రెండేళ్లు సీఎంగా పదవీకాలం పూర్తి చేసుకున్నారని కేంద్రమంత్రి గుర్తు చేశారు.

మొదటి, రెండో దశల్లో కరోనా నియంత్రణకు సమర్థవంతంగా పనిచేస్తున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. వైద్య సదుపాయాల కల్పనలో ఏపీ ముందుందని.. మంచి నిర్ణయాలు, పనులకు ఎప్పుడూ అండగా ఏపీ నిలుస్తోందని ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. కరోనా కట్టకికి నిరంతరం పనిచేస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలంతా ఏకమైతేనే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలం అని విశ్వాసం వ్యక్తం చేశారు. మెగా మెడికల్‌ ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్న సీఎం జగన్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్‌ ప్రభావం తగ్గించడం వల్ల దేశవ్యాప్తంగా ఆ ప్రభావం తగ్గించినట్లేదని తెలిపారు. అన్ని రంగాల్లో ముందుండి, అన్ని అంశాల్లో చొరవ తీసుకుని.. ముందుకు వెళ్తున్న ఏపీ మిగతా రాష్ట్రాలకు ఆదర్శమని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement