Monday, May 6, 2024

రఘురామ లేఖపై స్పందించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లో నాసిరకం మద్యం అంశంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖకు కేంద్రం స్పందించింది. ఏపీలో నాసిరకం మద్యం ఏరులై పారుతోందని, కొన్ని బ్రాండ్లు, డిస్టిలరీలు తయారు చేస్తున్న మద్యం తాగుతున్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారంటూ ఈ నెల 6న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. మద్యాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అందులో కోరారు. తాజాగా ఈ లేఖకు కేంద్రమంత్రి బదులిచ్చారు. లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలించి త్వరలోనే స్పందిస్తామని రఘురామకు మంత్రి బదులిచ్చారు. మద్యం ప్రభావాన్ని పరిశీలించి, త్వరలోనే వివరాలు తెలియజేస్తామని తెలిపారు.

ఈ వార్త కూడా చదవండిః ఈటలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ప్రధాన అనుచరుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement