Sunday, April 28, 2024

AP: శ్రీశైలం గౌరీ సదన్ లో ఇద్దరు సూసైడ్

శ్రీశైలం.. ప్రభన్యూస్.. : శ్రీశైలం దేవస్థానం గౌరీ సదనం 137 రూమ్ లో ఓ మహిళ, పురుషుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వెలుగుచూసింది. మల్లేష్ అనే వ్యక్తి ఈనెల 13న రూమ్ తీసుకున్నట్లు ఎంట్రీ బుక్ లో నమోదు కాగా, ఉదయం పక్క రూము తీసుకున్న యాత్రికులకు దుర్గoధం రావడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన క్లీనింగ్ సిబ్బందికి చెప్పగా.. రూము దగ్గరికి వెళ్లిన సిబ్బంది ఒక్కసారిగా నిర్గాంతపోయారు.

ఉరివేసుకుని వేలాడుతున్న ఇద్దరిని చూసి ఉన్నతాధికారులకు, అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి సిఐ ప్రసాదరావు తమ సిబ్బందితో చేరుకొని విచారణ చేపట్టారు. అనంతరం సిఐ మాట్లాడుతూ… హైదరాబాద్ కు చెందిన మల్లేష్, సరిత ఆత్మహత్య చేసుకున్నారని సంఘటన స్థలంలో వెతుకగా మహిళకు సంబంధించిన ఆధార్ ఆధారంగా మహిళ పేరు సరితగా గుర్తించారు. ఆమె వద్ద ఆధార్ తోపాటు కత్తి, శానిటైజర్ బాటిల్ దొరికాయి. అయితే మరణించిన మహిళ, పురుషుడు దంపతులా లేక ప్రేమ జంటనా అనే కోణంలో శ్రీశైలం సీఐ ప్రసాద్ రావు, పోలీసులు విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement