Tuesday, April 30, 2024

Accident – పేలిన కారు టైరు… ముగ్గురిని మింగేసిన మృత్యువు…

దేవరపల్లి: ఓ కారు టైర్ పేలడంతో వేరే రూట్లో వెళ్లే కారును ఢీకొట్టగా.. స్పాట్ లోనే ముగ్గురు మృతిచెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఇవాళ మధ్యాహ్నం జిల్లాలోని దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కారు టైరు పేలి డివైడర్‌ అవతలి వైపు వెళ్తోన్న మరో కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అదే మార్గంలో వెళ్తోన్న గోపాలపురం ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు ఆస్పత్రులకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement