Sunday, May 5, 2024

నాగావ‌ళిలో నీట మునిగి ఇద్ద‌రు బాలురు మ‌ర‌ణం …

శ్రీకాకుళం,ఆగష్టు 16:, శ్రీకాకుళం పట్టణంలోని పెద్దరెల్లి వీధికి చెందిన ముగ్గురు బాలురు బుధవారం నాగావళి నదిలో స్నానానికి దిగి మునిగిపోతుండగా ఒకరిని స్థానికులు రక్షించారు. ఇద్దరు నదిలో మునిగి చనిపోయారు. విశాఖపట్నం చెందిన కోన ఆనంద్ కుటుంబం పెద్దరెల్లి వీధిలో బంధువుల ఇంటికి పుట్టినరోజు వేడుకలకు వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి నాగావళి నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు బాలురు కార్తికేయ(11), గణేశ్‌గౌతం(9) నదిలో గల్లంతు కాగా మరో బాలుడు క్షేమంగా బయటపడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరు మృతదేహాలు సమీప ప్రాంతంలో లభ్యం అయ్యాయి. ఇద్దరు కుమారులు ఒక్కసారిగా మృత్యువు పాలు కావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఎవరూ ఓదార్చలేకపోతున్నారు. మృతదేహాలను రిమ్స్ ఆసుపత్రి కి పోస్టుమార్టంకు తరలించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement