అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గ్ పోలీసు స్టేషన్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేష్ పై కేసు నమోదు అయ్యింది. వైసీపీ నేత కొంగర భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఐపీసీ 153ఏ/34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నూతన మంత్రి నిర్వహించిన ర్యాలీలో ఒక బాలిక చనిపోయిందని చంద్రబాబు, లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ప్రజల మధ్య, పోలీసులపై విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు, లోకేష్ వ్యాఖ్యలున్నాయి అంటూ వైసీపీ నేత ఫిర్యాదు చేశారు. దీంతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.