Monday, May 6, 2024

AP: కృష్ణా జిల్లాలో జంట హత్యలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో జంట హత్యల కలకలం చోటుచేసుకుంది. పట్టపగలే దంపతులను దుండగులు నరికి చంపారు. మృతులు వీరకృష్ణ, వరలక్ష్మీగా గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలో అయ్యంకి గ్రామంలో వీరంకి వరలక్ష్మి, ఆమె భర్త వీరంకి వీరకృష్ణలను దుండగులు దారుణంగా హత్య చేశారు. వరలక్ష్మీని నడిరోడ్డుపై చంపగా, ఆమె భర్త వీరంకి వీరకృష్ణ ను పంచాయతీ ఆఫీస్ దగ్గర దారుణంగా హత్య చేశారు.

ఒక్కసారిగా ఒకేరోజు జంట హత్యలు చోటుచేసుకోవడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు. ఫ్యాక్షన్ కక్షల కారణంగానే ఈ హత్యలు చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. వీరంకి గణేష్, అతని ఇద్దరు సోదరులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement