Thursday, April 25, 2024

బీచ్‌లో ఆడుకుంటుండగా విషాదం.. అసలేం జరిగింది..

ప్రభ న్యూస్ : శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం, భావనపాడు సాగర తీరంలో విషాధం చోటు చేసుకుంది. సెంచూరియన్‌ యూనివర్సిటీలో వ్యవసాయ ఇంజినీరింగ్‌ విద్యార్థి శేఖర్‌ కుమార్‌ బెహరా(24) సముద్రంలో ప్రమాదవశాత్తు మునిగి మరణించాడు. ఈ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి సముద్రం లోపలికి వెళ్లిపోయారు. ఈ సంఘటన గుర్తించిన మెరైన్‌ పోలీసులు వెంటనే స్పందించారు. ఇద్దరిని రక్షించగలిగారు. దురదృష్టవశాత్తు శేఖర కుమార్‌ బెహర చనిపోయాడు. మృతుడి స్వస్థలం బరంపురం కాగా పర్లాకిమిడి లో చదువుతున్నాడు. నౌపడ ఎస్‌ఐ సాయి కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement