Thursday, April 25, 2024

గుంటూరు జిల్లాలో విషాదం.. సినిమా ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్​ షాక్, ఒకరు మృతి

కారంపూడి, (ప్రభ న్యూస్) : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కాబోతున్న రాధేశ్యామ్​ సినిమాకు ముందు గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. సినిమా విడుదల సందర్భంగా కారంపూడి పట్టణంలోని ఐమాక్స్ థియేటర్ ముందు  అభిమానులు భారీ ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు ఫ్లెక్సీ విరిగి పక్కనే ఉన్న కరెంటు లైన్ కు తగిలింది. దీంతో విద్యుత్ షాక్ తో ఘటనా స్థలంలోనే ఒకరు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతుడిని చల్లా కోటేశ్వరరావు (కోటి)గా గుర్తించారు. అతను  సెంట్రింగ్ వర్కర్ గా పని చేస్తున్నాడు. భార్య ఇద్దరు పిల్లలున్నట్లు తెలుస్తోంది. గాయాలైన వ్యక్తిని హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందించారు. అయితే చనిపోయిన కోటేశ్వరరావు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభాస్ ఫ్యాన్స్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement