Sunday, April 28, 2024

AP: భోగి రోజునే విషాదం… బైక్ – లారీ ఢీ… ముగ్గురు యువ‌కులు దుర్మ‌ర‌ణం …

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున దొరవారిసత్రం మండలం కలగుంట గ్రామంలో అతివేగంగా వచ్చిన లారీ బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తోన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు రాంకీ, మనిరాజ, గౌతమ్‌లు గుర్తించారు.

స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృత‌దేహల‌ను పోస్ట్ మార్ట‌మ్ కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు. బైక్ ఢీకొట్టిన వెంట‌నే లారీ అక్క‌డి నుంచి అతివేగంగా వెళ్లిపోయింది. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వాహ‌నం కోసం పోలీసులు సిసిటివిల‌ను పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement