Sunday, April 28, 2024

AP: ఇసుక దోపిడీపై రేపు ఉమ్మడి ఆందోళనలు చేస్తాం – అచ్చెన్నాయుడు

(ఆంధ్రప్రభ, అమరావతి) – వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ ఉచితంగా ఇచ్చిన ఇసుకను రద్దు చేసి, ఇసుక మాఫియాతో జత కట్టిన జగన్ రెడ్డి అయిదేళ్లల్లో రూ.50 వేల కోట్లు లూటీ చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని అక్రమ తవ్వకాల ఫోటోలు, నకిలీ బిల్లు పుస్తకాలు, తదితర ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, ఎన్జీటీ నిర్దారించినా జగన్ రెడ్డి ఇసుక దోపిడీని ఆపటం లేదని తీవ్రంగా ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల కనుసన్నల్లో 500కు పైగా రీచ్ ల్లో అక్రమంగా ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నార‌న్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాల్లో శనివారం 175 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన ఆందోళనలు చేపట్టినట్టు అచ్చెన్నాయుడు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement