Friday, May 3, 2024

రేపు అర్జిత సేవా టికెట్ల కోటా విడుదల..

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లకు సంబంధించి మార్చి, ఏప్రిల్‌, మే నెలల కోటాను బుధవారం సాయంత్రం 4 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వీటిలో కళ్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి. అదేవిధంగా మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన మిగతా అర్జిత సేవా టికెట్లకు ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ నమోదు ప్రక్రియ బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఈనెల 24 న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీడిప్‌లో టికెట్లు పొందినవారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు ఈ విషయాలను గుర్తించి శ్రీవారి అర్జిత సేవలను బుక్‌ చేసుకోవాలని కోరడమైనది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement