Friday, May 10, 2024

తిరుపతి ఐఐటీలో తిరుత్సవ 2022.. మూడు రోజుల పాటు వార్షిక టెక్నో కల్చరల్ ఫెస్ట్..​

ఏర్పేడు , ప్రభన్యూస్‌: తిరుపతి ఐఐటీ ఏర్పేడు శాశ్వత ప్రాంగణంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు- తిరుత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుత్సవ అనేది ఐఐటి తిరుపతి యొక్క వార్షిక టెక్నో సాంస్కృతిక ఉత్సవం. మూడు రోజుల పాటు విద్యుద్దీకరణ , సాంస్కృతిక పోటీలు, మనస్సును కదిలించే సాంకేతిక కార్యక్రమాలు, పలువురు ప్రముఖులతో అద్భుతమైన ప్రోషోలతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈవెంట్లు, పోటీలు మరియు ప్రదర్శనల యొక్క అన్ని ఉత్సవాలతో పాటు, తిరుత్సవ కార్యక్రమం ద్వారా శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలలో తమ ప్రతిభ ప్రదర్శించడానికి , నేర్చు కోవడానికి ఇది ఇది చక్కటి అవకాశంగా ఈ వేదికను నిర్వాహకులు నిర్వహించనున్నారు.

ఏర్పేడులోని ఐఐటీ తిరుపతి పర్మినెంట్‌ క్యాంపస్లో ఏప్రిల్‌ 15 నుంచి 17 వరకు తిరుత్సవాలు నిర్వహించ దానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇండియన్‌ ఐడల్‌ విన్నర్‌, బిగ్‌ బాస్‌ 5 ఫైనలిస్ట్‌ మరియు ఇండియన్‌ ఐడల్‌ తెలుగు హోస్ట్‌తో పాటు శ్రీరామ చంద్ర ఏప్రిల్‌ 16వ తేదీన ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఏప్రిల్‌ 17న డి జె ఈషా మరియు డిజె ఆష్ట్రిక్స్ర్‌ ప్రదర్శన ఇవ్వనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement