Monday, April 29, 2024

Tirupathi – పట్టాలు త‌ప్పిన ప‌ద్మావ‌తి ఎక్స్ ప్రెస్ …

తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌లోని యార్డ్‌లో ప‌ద్మావ‌తి ఎక్స్‌ప్రెస్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. ప్ర‌యాణీకులు దిగిపోయిన తర్వాత ట్రాక్ మారుతుండ‌గా పట్టాలు త‌ప్పింది.. మూడు బోగీలు ట్రాక్ నుంచి త‌ప్పాయి .. దీంతో రైల్వే అధికారులు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టారు. దీంతో ప‌ద్మావ‌తి, రాయ‌ల‌సీమ ఎక్స్‌ప్రెస్‌ను రీ షెడ్యూల్ చేసిన‌ట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే అధికారులు ప్ర‌క‌టించారు.

తిరుప‌తి నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన ప‌ద్మావ‌తి ఎక్స్‌ప్రెస్ (12763) ను రీ షెడ్యూట్ చేశారు. సాయంత్రం 4.55 గంట‌ల‌కు బ‌య‌ల్దేరాల్సిన ప‌ద్మావ‌తి ఎక్స్‌ప్రెస్ రాత్రి 7?45 గంట‌ల‌కు బ‌య‌ల్దేర‌నుంది. తిరుప‌తి నుంచి సాయంత్రం 5.30 గంట‌ల‌కు బ‌య‌ల్దేరాల్సిన తిరుప‌తి – నిజాముద్దీన్ – రాయ‌ల‌సీమ ఎక్స్‌ప్రెస్ రాత్రి 8 గంట‌ల‌కు బ‌య‌ల్దేర‌నుంది. ఈ విష‌యాన్ని రైలు ప్ర‌యాణికులు గ‌మ‌నించాల‌ని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement