Monday, April 29, 2024

Tirumala: 22 నుండి వైకుంఠ ద్వార దర్శనం…. ఉచిత టోకెన్ల జారీ

తిరుమ‌ల‌లో ఈనెల 22న శ్రీవారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి ఉచిత టోక‌న్ల‌ను జారీ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో తిరుప‌తిలోని 9ప్రాంతాల్లో 90కౌంటర్ల ద్వారా టికెట్ల మంజూరుకు ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా కౌంట‌ర్ల‌ను టీటీడీ జేఈవో స‌దాభార్గ‌వి త‌నిఖీ చేశారు.

తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్‌, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్‌, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్‌, ఎంఆర్ పల్లిలోని జడ్‌పి హైస్కూల్‌లో కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కౌంటర్లలో 4 లక్షలకు పైగా సర్వదర్శనం టోకెన్ల కోటా పూర్తయ్యేవరకు మంజూరు చేస్తామని వెల్లడించారు. కౌంటర్ల వద్ద ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేశామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, అల్పాహారం, టీ, కాఫీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటలు ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని చెప్పారు. దర్శన టోకెన్లు ఉన్నవారిని మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లవచ్చు గానీ దర్శనానికి అనుమతించబడరని, ఈ విషయాలను కౌంటర్ల వద్ద అనౌన్స్‌మెంట్ చేస్తామని చెప్పారు. తిరుపతిలోని అన్ని కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని, త్వద్వారా భక్తులు ఇతర ప్రాంతాల్లోని కౌంటర్లకు సులువుగా చేరుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల సమాచారం తెలుసుకుని ప్రణాళిక ప్రకారం తిరుమలకు వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రులుకావాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement