Saturday, May 11, 2024

భక్తులతో కిటకిటలాడిన తిరుమల.. 80వేల మందికి పైగా వచ్చినట్టు సమాచారం

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వారాంతపు సెలవుల కారణంగా భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఈ కారణంగా తిరుమలలో ఏ మూలన చూసినా భక్తులు తండోపతండాలుగా కనిపించారు. కరోనా కారణంగా టిటిడి పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం వైరస్‌ అదుపులోకి వస్తుండడంతో టిటిడి నిబంధనలను కొంత మేర ఎత్తివేయంతో అలిపిరి వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. శనివారం స్వామి వారిని దర్శించుకున్న భక్తులు 75 వేలు కాగా ఆదివారం 80 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement