Friday, May 17, 2024

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు – పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఎం జగన్‌ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు తీసుకెళ్లిన సీఎంకు మహాద్వారం వద్ద తితిదే ఛైర్మన్‌ కరుణాకర్‌ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.

రంగనాయక మండపంలో సీఎం జగన్‌కు వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా తితిదే 2024 క్యాలెండర్‌, డైరీని సీఎం విడుదల చేశారు. పెద శేష వాహనంపై శ్రీవారిని ఊరేగించనున్నారు. ఈ వాహన సేవలో సీఎం పాల్గొంటారు

Advertisement

తాజా వార్తలు

Advertisement