Monday, April 29, 2024

Missing: తిరుమలలో అదృశ్యం… కామారెడ్డిలో ప్ర‌త్యక్షం

తిరుమలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు కామారెడ్డి రైల్వేస్టేష‌న్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ప్రస్తుతం వీరిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు ఠాణాకు తరలించి ఏపీ పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

ఎస్‌ఐ సాయినాథ్‌ చౌదరి వివరాల మేరకు.. స్థానిక ఆర్బీసీ సెంటర్‌లో నివాసముంటున్న ఎస్‌.కృష్ణ కుమారుడు ఎస్‌.చంద్రశేఖర్‌(13), యోగేష్‌ కుమారుడు వైభవ్‌ యోగేష్‌(13), జి.శ్రీవర్దన్‌(13) తిరుమలలోని ఎస్వీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఇంటికి వెళ్లి పాఠశాలలో జరుగుతున్న పరీక్షకు తిరిగి హాజరుకాలేదు. దీంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. గాలించినా దొరక్కపోవడంతో తిరుమల టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సీసీ కెమెరాలు పరిశీలించగా విద్యార్థులు ల్యాప్‌టాప్‌లతో తిరుమల నుంచి ఆర్టీసీ బస్సులో తిరుపతికి చేరుకున్నట్లు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement