Sunday, April 28, 2024

AP | జనాలలోంచే రాయి విసిరారు … సీపీ కాంతి రాణా

సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి గురించిన విజయవాడ సీపీ కాంతి రాణా టాటా కీలక వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రికి తగిలిన దెబ్బలను బట్టి.. క్యాట్ బాల్ లేదా ఎయిర్ గన్ వాడి ఉంటారని అనుమానాలు వ్యక్తం కాగా.. అందుకే తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని.. ముఖ్యమంత్రిపై పడిన రాయి చేతితోనే విసిరారని సీపీ స్పష్టం చేశారు. సీఎంకు తగిలిన రాయి సైజు కూడా చేతిలో సరిపోయేంత సైజులోనే ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు.

ఈ అంశంపై సోమవారం (ఏప్రిల్ 15) ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పటికి ఘటన జరిగి 48 గంటలు అయ్యిందని.. ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారమే తాము ఈ వివరాలు చెబుతున్నామని అన్నారు. నిందితుడు దొరికితే దాడి వెనుక గల కుట్ర కోణం తెలుస్తుందని సీపీ చెప్పారు. అయితే, రాయిని చాలా బలంగా, వేగంగా విసిరారని.. అందుకే ఇద్దరికీ గాయం అయ్యిందని చెప్పారు.

‘‘సీఎం జ‌గ‌న్ కు రాయి తగిలి, వెల్లంపల్లి శ్రీనివాస్ కి తగిలి.. రాయి అవతల పడింది. సున్నితమైన భాగాల మీద నేరుగా తగిలి ఉంటే ప్రాణాపాయంగా మారేది. వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ కింద కేసు పెట్టాం. కింద జనాల్లో నుంచే రాయి పైకి విసిరారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దు’’ అని సీపీ కాంతి రాణా టాటా ప్రజలకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement