Friday, May 3, 2024

మిగిలిపోయిన బార్లకు సెప్టెంబర్‌ 6న వేలం..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 25 బార్ల లైసెన్స్‌ల మంజూరుకు ఎక్సైజు కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా, సోమవారం నుంచి సెప్టెంబర్‌ 3వ తేదీ వరకు పేర్ల నమోదు, రిజిస్ట్రేషన్‌ చేస్తారు. సెప్టెంబర్‌ 5వ తేదీలోగా నాన్‌ రిఫండబుల్‌ దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 5వ తేదీ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 6న ఈ-ఆక్షన్‌ విధానంలో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు వేలం నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రివైజ్‌డ్‌ బిడ్డింగ్‌ నిర్వహించనున్నట్లు కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. రాష్ట్రంలోని ఎక్కెడెక్కడ బార్లకు వేలం నిర్వహిస్తున్నారనేది గెజిట్‌ నోటిఫికేష్‌లో చూసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement