Sunday, April 28, 2024

KNL: సంక్షేమ ఫలాలు అర్హులకు అందించడమే ధ్యేయం… మంత్రి జయరామ్

ఆలూరు, ప్రభ న్యూస్ : సంక్షేమ ఫలాలు అర్హులకు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. చింతకుంట 2 సిరుగాపురంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సర్పంచ్ సద్దాం, ఎంపీపీ నేటేకంటమ్మ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మంత్రి గుమ్మనూర్ జయరాం, సోదరుడు దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

గత నాలుగు సంవత్సరాలుగా రూ.3కోట్ల 45లక్షలు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ భీమప్ప చౌదరి, చింతకుంట సొసైటీ చైర్మన్ అర్థగిరి శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ నగేష్ నాయుడు, సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement