Monday, May 6, 2024

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 45 గంటలు

తిరుమల ప్రభన్యూస్‌ ప్రతినిధి: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం అనూహ్యంగా పెరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమల బాటపట్టారు. కాగా రెండు కాలినడక మార్గాలు, రోడ్డు మార్గాలలో భక్తులు తండోపతండాలుగా తిరుమలకు చేరుకుంటుండడంతో తిరుమలలో ఎక్కడ చూసిన కిక్కిరిసిన క్యూలైన్‌లు దర్శనమిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సు, నారాయణగిరి ఉద్యాన వనాలలో ఏర్పాటు చేసిన క్యూలైన్‌లు భక్తులతో పూర్తిగా నిండి క్యూలైన్‌ గోగర్భండ్యామ్‌ సమీపం వరకు చేరుకుంది.

- Advertisement -

దీంతో టిటిడి అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్‌లో వేచివున్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, అల్పాహారం వంటివి శ్రీవారి సేవకుల సహాయంతో అందచేస్తున్నారు. అధిక రద్దీ కారణంగా సర్వదర్శనానికి 45 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. దీంతో సర్వదర్శనానికి క్యూలైన్‌లోకి భక్తులను అనుమతించడం టిటిడి తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ రద్దీ మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement