Sunday, April 28, 2024

Brutal Killing – సోదరి వెంట పడవద్దని వార్నింగ్…ప్రతికారంగా పెట్రోల్ పోసి సజీవ దహనం..

బాపట్ల – తన సోదరి వెంటపడి వేధించవద్దని వార్నింగ్ ఇచ్చిన విద్యార్ధిపై అతడి స్నేహితుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. ఈ ఘటన బాపట్ల జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీలోని ఉప్పలవారిపాలేనికి చెందిన ఉప్పల అమర్నాథ్ పదో తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం రాజోలులో ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా మార్గమధ్యంలో రెడ్లపాలెం వద్ద అమర్నాథ్‌పై దాడికి పాల్పడ్డారు. అనంతరం కాళ్లు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో బాలుడి గట్టిగా కేకలు వేశాడు. రక్షించాలని వేడుకున్నాడు. ఈ అరుపులు విన్న ఇరుగుపొరుగువారు వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశారు. గుంటూరు జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

అయితే స్నేహితుడు వెంకటేశ్వర్‌రెడ్డి మరికొందరితో కలిసి దారుణానికి ఒడిగట్టాడని అమర్నాథ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. కాగా, . అమర్నాథ్ సోదరిని వెంకటేశ్వర్ రెడ్డి తరుచు వెంటపడి వేధిస్తున్నాడు . ఈ విషయం తెలుసుకున్న అమర్నాథ్ వెంకటేశ్వర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి వేధిస్తే బాగోదని గట్టిగా హెచ్చరించాడు. దీంతో అమర్నాథ్‌పై కక్ష పెంచుకున్న వెంకటేశ్వర్ రెడ్డి గతంలో దాడికి పాల్పడ్డాడు. అయితే కుటుంబ సభ్యులు గట్టిగా హెచ్చరించారు. తాజాగా శుక్రవారం ఉదయం ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.. చెరుకుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt

Advertisement

తాజా వార్తలు

Advertisement