Friday, May 3, 2024

AP: జగన్మాత సేవలో తెలంగాణ మంత్రి పొంగులేటి

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : బెజవాడ కనకదుర్గమ్మ ని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాధురి దంపతులు దర్శించుకున్నారు. వీరి వెంట మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద రెడ్డి, శ్రీ లక్ష్మి దంపతులు కూడా ఉన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే మంత్రితో పాటు ఎంపీ మిధున్ రెడ్డి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి రాగా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కర్నాటి రాంబాబు, ఏఈఓ రమేష్ లు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.

దర్శనానంతరం మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం చేశారు. చైర్మన్ కర్నాటి రాంబాబు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇంజనీర్ రమాదేవి, ఆలయ అధికారులతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు ఇతర సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement