Thursday, May 2, 2024

AP: సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఆయ‌న‌ దాఖలు చేసిన పిటిషన్‌ను పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌వీ శ్రావణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై వాదనలు జరిగాయి.

అయితే హరిరామ జోగయ్య దాఖలు చేసిన సవరణలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం.. పిల్‌గా పరిగణించేందుకు అంగీకరించింది. హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌కు నెంబర్ కేటాయించాలని హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం ప్రతివాదులుగా ఉన్న జగన్, సీబీఐ, సీబీఐ కోర్టుకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement