Monday, April 29, 2024

AP : హెలికాప్ట‌ర్ లో సాంకేతిక లోపం.. ప‌వ‌న్ రెండు ప్ర‌చార స‌భ‌లు ర‌ద్దు

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 ప్రచారం హోరెత్తిపోతోంది. ఒక పక్క నామినేషన్లు.. మరోపక్క ప్రచారపర్వం మార్మోగుతున్నాయి. ముఖ్యంగా ఎన్డీయే కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఇవాళ‌ ఊహించని అంతరాయం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన హెలీకాప్టర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. హెలీకాప్టర్ ఇంజన్ స్టార్ట్ అయినప్పటికీ పైకి ఎగరడంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో పశ్చిమగోదావరి జిల్లా పర్యటనను జనసేనాని రద్దు చేసుకున్నారు. తిరిగి చేబ్రోలులోని తన నివాసానికి వెళ్లిపోయారు.

పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో కూర్చొన్న తరవాత టేకాఫ్ సమయంలో ఇంజిన్ లో సమస్య తలెత్తింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి తాడేపల్లిగూడెం సభకు రావాల్సి ఉండగా ఈ అవాంతరం ఏర్పడింది. ఫలితంగా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా వేశారు. ఆ రెండు నియోజకవర్గాలలో సభలను మరొక రోజు నిర్వహిస్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement