Sunday, May 5, 2024

Breaking: టీచ‌కుడి కిరాత‌కం, స్కూలు పిల్ల‌ల‌తో అస‌భ్య‌పు చేష్టలు.. భ‌గ్గుమ‌న్న త‌ల్లిదండ్రులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఆడ‌పిల్ల‌ల‌ను లైంగికంగా వేధింపుల‌కు గురిచేస్తున్న ఓ టీచ‌కుడి కిరాత‌కం బ‌య‌ట‌ప‌డింది. చాలాకాలంగా అమ్మాయిల‌ను వేధిస్తున్నా వారు ఎవ‌రికీ చెప్పుకోలేక గ‌మ్మునుండిపోయారు. ఇక దీన్ని అలుసుగా తీసుకుని ఆ మాస్టారు మ‌రింత చెల‌రేగిపోయాడు. అత‌ని ఆగ‌డాలు శృతిమించ‌డంతో పిల్ల‌లు త‌మ త‌ల్లిదండ్రుల‌కు ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. చాలా రోజులుగా ఏడుస్తూ ఎవ‌రికీ చెప్ప‌లేక.. చెప్పుకోలేక ఈ విష‌యాన్ని త‌మ‌లోనే దాచుకున్నారు. ఇక అత‌ని ఆగ‌డాలు భ‌రించ‌లేమ‌ని అస‌లు విష‌యం త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌డంతో వారు ఆగ్ర‌హానికి గుర‌య్యారు. స్కూల్‌కు వెళ్లి దాడి చేయాల‌నుకున్నారు.

ఇది గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలోని వ‌ట్టిచెరుకూరు మండ‌లంలో జ‌రిగింది. కాట్ర‌పాడు హైస్కూల్‌లో ఇంగ్లిష్ పాఠాలు చెప్పే ఓ మాస్టారు పిల్ల‌ల‌తో వ్య‌వ‌హ‌రించిన తీరు యావ‌త్ ఉపాధ్యాయ రంగానికే చెడ్డ‌పేరు తెచ్చేలా ఉంది. ఇవ్వాల (మంగ‌ళ‌వారం) విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు స్కూల్‌కు వ‌చ్చి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పోలీసుల‌కు ఈ విష‌యం మీద కంప్లెయింట్ ఇవ్వ‌డంతో ఇది కాస్త బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది. ఇంగ్లిష్ మాస్టారుపై కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. త‌దుప‌రి విచార‌ణ జ‌రుపుతామ‌ని తెలియ‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement