Saturday, May 4, 2024

నేడు మంగ‌ళ‌గిరిలో టీడీపీ నారీ సంక‌ల్ప దీక్ష

మంగ‌ళ‌గిరి టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో తెలుగుదేశం పార్టీ మహిళ విభాగం ఈరోజు నారీ సంకల్ప దీక్షను చేయనుంది. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత నేతృత్వంలో జరిగే ఈ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు హాజరుకానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పార్టీ కార్యాలయంలో ఈ దీక్ష జరగనుంది. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కనీసం దిశ చట్టాన్ని కూడా అమలు చేయలేకపోతున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. వ‌రుస‌గా మహిళలపై జ‌రుగుతున్న‌ అత్యాచారాలు, పోలీసుల వైఫల్యాలను నిరసిస్తూ ఈ దీక్షను చేపడుతున్నట్లు వంగలపూడి అనిత తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement