Saturday, September 21, 2024

TDP – మాజీ మంత్రి పల్లె ఆధ్వర్యంలో జగనాసుర దహనం

శ్రీ సత్య సాయి బ్యూరో అక్టోబర్ 23: (ప్రభన్యూస్) దేశమంతా రావణాసుర దహనం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కలిసి జగనాసుర దహనాన్ని చేస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపుమేరకు తన స్వగృహంలో మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె పాల్గొన్నారు. సైకో పోవాలి అని రాసి ఉన్న పేపర్లను మంటల్లో వేస్తూ చంద్రబాబు నాయుడు కి తన మద్దతు తెలియజేశారు.

సోమవారం రాత్రి ఏడు గంటలకు ఐదు నిమిషాల మధ్యలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్ర ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారని ఈ సందర్భంగా పల్లె అన్నారు. పల్లె మాట్లాడుతూ నాలుగు గోడల మధ్య నిజాన్ని దాచలేరని, 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన జగన్ ఏదో విధంగా చంద్రబాబు ని కూడా జైల్లో పెట్టాలని ఉద్దేశంతో కక్షగట్టి అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement