Monday, May 6, 2024

కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం కండి ….టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

ప్యాపిలి – ..రాబోయే కురుక్షేత్ర యుద్ధానికి ప్రజలంతా సిద్ధంగా ఉండి అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతోసహ పెకిలించాలని మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు .మీ భవిష్యత్ కు నాది గ్యారంటీ అంటూ భరోసానిచ్చారు.

.

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా గుత్తిలో పర్యటన ముగించుకొని ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి కి చేరుకున్నారు. జిల్లాలోకి ప్రవేశించిన టిడిపి అధినేత చంద్రబాబుకు డోన్ టిడిపి ఇన్చార్జ్ ధర్మారం సుబ్బారెడ్డి తో పాటు నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ ,మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ,టిడిపి రాష్ట్ర కార్యదర్శులు వై నాగేశ్వరరావు యాదవ్ వలసల రామకృష్ణాల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు .చంద్రబాబు రాక సందర్భంగా ప్యాపిలి పట్టణ వీధులన్నీ పసుపు తోరణాలతో అలంకరించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ అధినేతకు అడుగడుగునా జన నీరాజనాలు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement