Monday, April 29, 2024

Supreme Shock – అవినాష్ బెయిల్ పిటిషన్ విచారణకు నో … టెన్ష‌న్ లో వైసిపి నేత‌లు

న్యూఢిల్లీ – సుప్రీం కోర్టు పరిశీలన లో ఉండటం వల్ల తన ముందస్తు బెయిల్ విచారణ త్వరగా తేలటం లేద‌ని,.. వెకేషన్ కోర్టులో త‌న ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ముగించెలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరుతూ ఎంపి అవినాష్ రెడ్డి న్యాయవాదులు మ‌ళ్లీ సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.. అప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా సిబిఐ ని ఆదేశించాల‌ని కోరుతూ సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు అవినాష్ రెడ్డి. ఈ మేరకు వెకేషన్ బెంచ్ ముందు ప్రత్యేక మెన్షన్ చేశారు అవినాష్ తరపు న్యాయవాదులు. అయితే ఈ పిటీషన్‌ ను సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు ఈ పిటీషన్‌ ను విచారించలేమని పేర్కొంది సుప్రీం కోర్టు. దీంతో సుప్రీం కోర్టులో వైసీపీ ఎంపీ ఎంపి అవినాష్ రెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది. దీంతో సిబిఐకు అవినాష్ ను అరెస్ట్ చేసే మార్గం సుగ‌మం అయింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement