Friday, May 3, 2024

కర్నూలులో హైకోర్టు కోసం పోస్ట్ కార్డ్ ఉద్యమం

శ్రీ బాగ్ ఒప్పందం అమలు ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ ఐక్య విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని పలు జూనియర్, డిగ్రీ పీజీ కళాశాలలో, వసతి గృహాలలో కర్నూలు హైకోర్టు ఏర్పాటు కోసం పోస్ట్ కార్డు ఉద్యమం, అవగాహన సదస్సులు రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కోనేటి వెంకటేశ్వర్లు, కొత్తకోట మోహన్ మాట్లాడుతూ పెద్ద మనుషుల ఒప్పందాన్ని గౌరవిస్తూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. బిజెపి 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హైకోర్టు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుక రావాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement