Saturday, April 20, 2024

శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వికోసం ‘గుత్తా’ నామినేష‌న్ – ఏక‌గ్రీవం అయ్యే ఛాన్స్

శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ ప‌ద‌వికోసం నామినేష‌న్ దాఖ‌లు చేశారు మాజీ శాస‌న మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి. శాసన సభ సచివాలయంలోని సెక్రెటరీ ఛాంబర్ లో శాసన మండలి ఛైర్మన్ పదవి కొరకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్‌ కార్యమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మొహమ్మద్ ఆలీ, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎం ఎస్ ప్రభాకర్ రావు, గొంగిడి సునీత, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు భాను ప్రసాదరావు, దామోదర్ రెడ్డి, గంగాధర్, యాగ మల్లేశం, జనార్ధన్ రెడ్డి, నవీన్ కుమార్, బండ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.కాగా.. రేపు దీనికి సంబంధించిన ఎన్నిక జరుగనుంది. రేపు ఉదయం 11 గంటల సమయంలో జరిగే ఛాన్స్‌ ఉంది. ఎమ్మెల్యేల సంఖ్య బలం టీఆర్‌ఎస్ కి ఎక్కువ ఉండటం, మరేవరూ నామినేషన్లు వేయకపోవడంతో గుత్తా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement