Monday, April 29, 2024

మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 3 నుంచి 7 వ తేదీ వరకు జరగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 3న శ్రీసీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలవై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులను కనువిందు చేస్తారు. రెండవ రోజు 4 న రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో మూడుసార్లు విహరిస్తారు. ఇక మూడవరోజు మార్చి 5 న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. అదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగోరోజు ఐదుసార్లు, చివరిరోజు 7 వ తేదిన ఏడుసార్లు తెప్ప పై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

- Advertisement -

ఆర్జిత సేవలు రద్దు..

తెప్పోత్సవాల కారణంగా మార్చి 3, 4 తేదీల్లో తోమాల సేవ, అర్చన, సహస్రదీపాలంకార సేవ 5, 6 తేదీల్లో తోమాల సేవ, అర్చన, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, 7 న అర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement