Monday, May 27, 2024

ఆదిత్యుని సన్నిధిలో మంత్రి కాకాణి

శ్రీకాకుళం : ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అయిన అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిని గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. మంత్రికి స్వామి వారి జ్ఞాపికను ఆలయ సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ ,ఆలయ జూనియర్ అసిస్టెంట్ బి.ఎస్.చక్రవర్తి తదితరులు పాల్గున్నారు.

డీసీసీబీ డైరెక్టర్లతో మంత్రి కాకాణి సమీక్ష
శ్రీ‌కాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో బ్యాంకు డైరెక్టర్లతో నిర్వ‌హించిన స‌మీక్ష‌కు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ డిప్యూటీ సీఎం, సీనియర్ శాసన సభ్యులు ధర్మాన కృష్ణ దాస్, డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, డీసీఎమ్ఎస్ ఛైర్పర్సన్ ఎస్.సుగుణ, బ్యాంకు సీఈవో వర ప్రసాద్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కే.శ్రీధర్ పాల్గొన్నారు. అనంత‌రం ప‌లు విష‌యాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement