Sunday, April 28, 2024

AP : ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత… ఎమ్మెల్యే అశోక్ బాబు

సోంపేట, ఫిబ్రవరి 27(ప్రభ న్యూస్): గ్రామాల్లో స్నేహపూర్వకమైన వాతావరణ ఏర్పడాలంటే అది ఒక్క దైవ కార్యక్రమాలతోనే సాధ్యపడుతుందని ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన ఉంటే మానసికంగా ఎంతో ప్రశాంతత లభిస్తుందని ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు తెలిపారు.

- Advertisement -

మంగళవారం గొల్లవూరు సచివాలయం తురక శాసనం పంచాయతీ పరిధిలో పాత జాతీయ రహదారి నుండి త్వరగా శాసనం గ్రామదేవత శ్రీశ్రీశ్రీ ముక్కెర పోలమ్మ అమ్మవారి గుడికి సిసి రోడ్లు నిర్మాణానికి ఎంపీ నిధులు ఐదు లక్షల రూపాయలతో ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ బాబు స్థానిక తెదేపా నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. పల్లె వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే విరాజిల్లుతుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement