Thursday, May 2, 2024

ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగనే సీఎం : ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌

ఏపీలో ఇప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఎప్పుడొచ్చినా గెలిచి ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని మాజీ ఉప ముఖ్యమంత్రి, నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ జోస్యం చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని చీడిపూడి గ్రామంలో నిన్న జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే మా పార్టీకి బలం అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు- ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు చేయాలని జగన్‌ చూస్తున్నారని అన్నారు. జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కాకుంటే తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తానని అన్నారు. పొత్తు లేకుండా టీ-డీపీ, జనసేన 175 స్థానాల్లో పోటీ- చేయగలవా? అని ప్రశ్నించారు. టీ-డీపీకి పవన్‌ కల్యాణ్‌ వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయం అంటే సినిమా కాదని, దానికి ఎంతో పరిణితి కావాలని పవన్‌కు కృష్ణదాస్‌ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement