Friday, April 26, 2024

సోము వీర్రాజు త‌న వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకోవాలి : శ్రీకాంత్ రెడ్డి

కడప ప్రజలు మనుషులను చంపుతారని వారికి ఎయిర్ పోర్టు అవసరమా అని సోమువీర్రాజు వ్యాఖ్యలు చేయడం శోచనీయమ‌ని, ఆయన తన వ్యాఖ్య‌ల‌ను వెంట‌నే వెనక్కు తీసుకొని క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ప్ర‌భుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. క‌డ‌ప ఎయిర్‌పోర్టు విష‌యంలో చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి.. అయితే ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై శ్రీకాంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. లాభాల కోసం సినిమాల్లో ఆ ప్రాంత సాంస్కృతిని దిగజార్చార‌ని మండిప‌డ్డారు శ్రీ‌కాంత్ రెడ్డి.. ఆ ప్రాంతంలో బీజేపీ జెండా పట్టుకుని తిరిగే వారున్నారు.. వాళ్లయినా, సోము వీర్రాజు అయినా ఈ వ్యాఖ్యలపై సిగ్గుపడాల‌న్న ఆయ‌న‌.. రాయల సీమ ప్రజలను ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరణ చేశారు.. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్ లు నమోదు అవుతూన్నాయో సోము వీర్రాజు చూడాల‌ని హిత‌వు ప‌లికారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement