Sunday, April 28, 2024

Somireddy Counter: త‌ల్లికి, చెల్లికి న్యాయం చేయ‌లేక మాపై ప‌డి ఏడ్వ‌టం ఎందుకు …జ‌గ‌న్‌కు సోమిరెడ్డి కౌంట‌ర్

నెల్లూరు – తల్లి, చెల్లికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి వైఎస్‌ జగన్‌ అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. కుట్రలు చేస్తారు, కుతంత్రాలు చేస్తారు.. కుటుంబంలో చిచ్చు పెడతారు అంటూ ఏపీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, తన తల్లి విజయమ్మ.. చెల్లి షర్మిలను తెలుగుదేశం పార్టీనే తనకు దూరం చేసిందని వైఎస్‌ జగన్ అంటున్నార‌ని,.. తల్లిని, చెల్లిని మేం దూరం చేశామా? అని ప్రశ్నించారు.

తల్లి.. చెల్లికి కూడా న్యాయం చేయలేని జ‌గ‌న్ కు సిగ్గూ . శరం లేదని ఫైర్ అయ్యారు. ఎవరినీ శత్రువులుగా చూడకూడద‌ని, అందరినీ సమానంగా చూడాలని క్రిస్మస్ రోజున జగన్ సందేశం ఇవ్వడం విడ్డూరం అన్నారు. ఎవరినీ శత్రువులుగా చూడకూడదని చెబుతాడు. మా అందరిపైనా అక్రమ కేసులు పెట్టి వేధిస్తాడు.. ఇది ఆయన నైజం అంటూ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు సోమిరెడ్డి. ఇక, సర్వేపల్లి నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి కాకాని చెప్పినట్లు నడుస్తోందని విమర్శించారు సోమిరెడ్డి.. జాతీయ రహదారి పక్కన వందల కోట్ల రూపాయల విలువైన భూమిని బినామీ పేర్లతో మంత్రి కాకాణి దోచుకుంటున్నార‌ని ఆరోపించారు.

వెంకటాచలంలో తహసిల్దారుగా పనిచేసిన ప్రసాద్ అనే అధికారి రికార్డులను మార్చే శార‌న్నారు. గ్రామ సభలు పెట్టకుండా పట్టాలు ఇచ్చార‌ని, ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ లో ఉన్నార‌ని వివ‌రించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో పనిచేసిన తహసిల్దార్ కూడా సస్పెండ్ అయ్యార‌ని గుర్తు చేశారు. మంత్రి కాకాని కింద రెవెన్యూ శాఖ అని నలిగిపోతోంద‌ని ఫైర్ అయ్యారు…. భూములకు సంబంధించిన వివరాలను ఆయా కార్యాలయాల్లో అధికారులు ప్రదర్శించాలి అని డిమాండ్‌ చేశారు. పది రోజుల్లో అధికారులు స్పందించకపోతే కలెక్టరేట్ ను ముట్టడిస్తాం అని హెచ్చరించారు సోమిరెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement