Friday, May 17, 2024

Angallu: చంద్రబాబుకు కాస్త ఊరట.. ముందస్తు బెయిల్‌

అమరావతి: అంగళ్లు ఘటనలో తెదేపా అధినేత చంద్రబాబుకు కాస్త ఊరట లభించింది. రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ మేరకు తీర్పు రిజర్వ్‌ చేసిన కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ.. రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement