Monday, April 29, 2024

Skill Case … సీఐడీ అధికారుల కాల్‌డేటా ఇవ్వాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా

విజయవాడ: టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు ముందు, ఆ సమయంలో, ఆ తర్వాత సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డులు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 18కి విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. కాల్‌డేటా భద్రపరచాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్‌ వేశారు. ఇప్పటికే ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement