Monday, April 29, 2024

విశాఖలో దారుణం.. ఒకే కుటుంబంలోని ఆరుగురు హత్య

నిద్ర‌లేస్తూనే విశాఖ ఉలిక్కిప‌డింది. రాత్రికి రాత్రే జిల్లాలో రెండు ఘోరాలు జ‌రిగిపోయాయి. ఏకంగా ప‌ది మంది ప్రాణాలు పోయాయి. మ‌ధుర‌వాడ‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాస‌ముంటున్న ఓ ఎన్నారై కుటుంబం అనుమానాస్ప‌ద మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపితే.. ఆ కొద్దిసేప‌టికే న‌గ‌రంలో మ‌రోచోట ఇంకో దారుణం వెలుగుచూసింది. పెందుర్తి మండలం జుత్తాడలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురయ్యారు.

జిల్లాలోని పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఈ ఆరు హత్యలకు పాత కక్షలే కారణమయినట్లు తెలుస్తోంది. అప్పలరాజు అనే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలు ఈ హత్యలకు కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలు, ఒక పురుషుడు ఉన్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుంటే విశాఖపట్నం మధురవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మధురవాడలోని ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లో ఆ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. అయితే ఘటనా స్థలంలో రక్తం మరకలు కనపించాయి. దీంతో మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. మృతులను బంగారు నాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్ లుగా గుర్తించారు. బంగారునాయుడు ఆ ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

స్థానికులు ఇచ్చిన‌ స‌మాచారంతో పోలీసులు అక్క‌డి చేరుకున్నారు. 8 నెలల క్రితమే ఎన్నారై కుటుంబం ఈ అపార్ట్‌మెంట్‌లోకి వచ్చినట్టుగా వారు చెబుతున్నారు. మృతులు బంగారు నాయుడు(50), నిర్మల (44), దీపక్‌(22), కశ్యప్‌ (19)గా గుర్తించారు. పోలీసులు మ‌రిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

–>
 
Advertisement

తాజా వార్తలు

Advertisement