Thursday, May 2, 2024

విశాఖలో తీవ్రంగా బ్లాక్ ఫంగస్: టీడీపీ ఎమ్మెల్యే

విశాఖ జిల్లా బ్లాక్ ఫంగస్ చాలా తీవ్రంగా ఉందని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపుడి రామకృష్ణ అన్నారు. బ్లాక్ ఫంగస్ పై ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. శాసన సభ్యుడిగా లేఖ రాసినా సీఎం సహా ప్రభుత్వ అధికారులు ఎవ్వరూ స్పంధించడం లేదన్నారు. 7 వేల బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ లు పంపామని ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. విశాఖకు కేవలం 60 ఇంజక్షన్లు మాత్రమే వచ్చాయన్నారు. మరణాల విషయంలో కూడా ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని ఆరోపించారు. విశాఖలో స్మశానాలు ఎంత రెద్దీగా ఉన్నాయో చూడాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement