Sunday, April 28, 2024

AP : ప్రకాశం జిల్లాలో ష‌ర్మిల ప‌ర్య‌ట‌న

ఇవాళ‌ ప్రకాశం జిల్లాలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పర్యటించనున్నారు. ఉదయం షర్మిల యర్రగొండపాలెంలో పర్యటిస్తారు. ఆమె గత కొద్ది రోజులుగా న్యాయయాత్ర పేరిట రాష్ట్రంలో పర్యటిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ఆమె ప్రచారం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ మూడు స‌భ‌ల్లో ఆమె పాల్గొంటారు.

వైఎస్ షర్మిల యర్రగొండపాలెం సభలో ప్రసంగించిన తర్వాత సాయంత్రం సంతనూతలపాడు కు చేరుకుంటారు. అక్కడి సభలో ప్రసంగించిన అనంతరం అద్దంకిలో జరిగే సభకు హాజరవుతారు. వరస సభలతో వైఎస్ షర్మిల కాంగ్రెస్ కు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. షర్మిల పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement