Sunday, April 28, 2024

AP: ఉషశ్రీ చరణ్ కు స్థాన చలనం …. పెనుగొండ నుంచి బరిలోకి ..

శ్రీ సత్యసాయి బ్యూరో, డిసెంబర్ 28 (ప్రభన్యూస్): వచ్చే ఎన్నికల్లో తాను పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నానని. అధిష్టానం నుంచి తనకు ఆదిశగా ఆదేశాలు వచ్చాయని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు.

ఈ స్థాన చలనంపై ఆమె మాట్లాడుతూ, ” సీఎం జగన్ ఆదేశించారు. నేను పెనుకొండ వెళ్తున్నా, కళ్యాణదుర్గం స్థానాన్ని బోయలకు కేటాయించాలని నిర్ణయించారు. ఆయన నిర్ణయం స్వాగతిస్తున్నాను. ఆదేశాలు పాటిస్తాను. ఇన్ని రోజులు కళ్యాణదుర్గం ప్రజలు ఎంతో ఆదరించారు.వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా. సామాజిక సమీకరణలలో భాగంగానే మార్పు జరిగినది. మేము ఎక్కడికి వెళ్లినా, ఒక్కటే నినాదం. అది జగన్ నినాదం. ప్రజలు ఎక్కడైనా సరే జగన్ ని, ఫ్యాన్ గుర్తునే చూస్తున్నారని” మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement