Friday, May 10, 2024

సికింద్రాబాద్‌ – తిరుపతి వందే భారత్‌ రైలు సీట్ల సామర్ధ్యం రెట్టింపు

అమరావతి, ఆంధ్రప్ర భ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8 ఏప్రిల్‌ 2023న జెండా ఊపి ప్రారంభించిన సికింద్రాబాద్‌ – తిరుపతి – సికింద్రాబాద్‌ వందే భారత్‌ రైలు ఇప్పుడు వేగంగా మరియు అధిక ప్రయాణీకుల సామర్థంతో ప్రయాణించనుంది. 8 కోచ్‌లు మరియు 530 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో ప్రయాణించే రైలు 16 కోచ్‌లు మరియు 1,128 అదిక ప్రయాణికుల సామర్థ్యంతో 17 మే 2023 నుండి సేవలను అందించబోతుంది. దీనివల్ల, రెండు దిశలలో ప్రయాణ సమయం కూడా 15 నిమిషాలు తగ్గుతోంది మరియు 8.30 నిమిషాల పాటు నడస్తున్న రైలు ప్రస్తుతం 8 గంటల 15 నిమిషాలలో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది.

సికింద్రాబాద్‌ – తిరుపతి – సికింద్రాబాద్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభంలో 8 కోచ్‌ల కూర్పుతో ప్రవేశపెట్టారు. ఇందులో 01 ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ మరియు 07 చైర్‌ కార్లు ఉన్నాయి. సాధారణ సేవలను ప్రవేశపెట్టినప్పటి నుండి, రైలు స్థిరంగా 100 శాతం కంటే ఎక్కువ సామర్థ్యంతో ప్రయాణికుల ప్రోత్సాహంతో నడుస్తోంది. రైలు నంబర్‌ 20701 సికింద్రాబాద్‌ – తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏప్రిల్‌లో 131 శాతం మరియు మే 2023లో 135 శాతం, రైలు నంబర్‌ 20702 తిరుపతి – సికింద్రాబాద్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏప్రిల్‌లో 136శాతం మరియు మే 2023లో.138 శాతం మేర ప్రయాణికుల నుండి విశేషమైన స్పందన లభించింది.

- Advertisement -

ప్రయాణీకుల సంఖ్య పరంగా, 15 మే 2023 వరకు, మొత్తం 44,992 మంది ప్రయాణికులు రెండు దిశలలో వందే భారత్‌ రైలు సేవలను పొందారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి 21,798 మంది ప్రయాణికులు రాగా, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు మరో 23,194 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ముఖ్యముగా, కోచ్‌ల యొక్క రెండు విభాగాలు – ఎగ్జిక్యూటివ్‌ మరియు చైర్‌ కార్‌ 100 శాతం కంటే ఎక్కువ ప్రోత్సాహాన్ని పొందాయి. దీని ప్రకారం, రైలు 17 మే 2023 నుండి ప్రస్తుత 8 కోచ్‌ కెపాసిటీకి బదులుగా 16 కోచ్‌ ల సామర్థంతో నడపబడుతోంది. కొత్త కంపోజిషన్‌లో 1,024 కెపాసిటీతో 14 చైర్‌ కార్లు ఉంటాయి (గతంలో 478 సామర్థం ఉన్న 6కి బదులుగా) మరియు 104 కెపాసిటీతో 02 ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ (52 సామర్థం ఉన్న అంతకుముందు 1 కోచ్‌కి బదులుగా) కార్స్‌ ఉంటాయి.

అంతేకాకుండా, సికింద్రాబాద్‌ మరియు తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా రెండు దిశలలో ప్రయాణ సమయాన్ని 15 నిమిషాలు తగ్గించడంతో వేగంగా తయారు చేయబడింది. అందుకని, సికింద్రాబాద్‌ మరియు తిరుపతి మధ్య దూరం రెండు దిశలలో అంతకుముందు 8.30 గంటల వ్యవధిలో కాకుండా 8 గంటల 15 నిమిషాలలో చేరుతుంది. ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ కోచ్‌ల రెట్టింపుతో అధిక సంఖ్యలో రైలు ప్రయాణికులు వందే భారత్‌ రైలు సేవలను పొందగలుగుతారని అయన తెలిపారు. కోచ్‌లను సకాలంలో రెట్టింపు చేయడం కూడా అదనం అని, ఈ వేసవి సెలవుల సీజన్‌లో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు తిరుపతికి వచ్చే అవకాశం ఉంటు-ందని ఆయన అన్నారు. ఇంకా, ప్రయాణ సమయం తగ్గింపు తో రైలు ప్రయాణీకులకు వారి ప్రయాణాన్ని వేగంగా మరియు మరింత సౌకర్యవంతమైన రీతిలో పూర్తి చేయడంలో సహాయపడుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement