Friday, May 17, 2024

టీడీపీ నేత వంగ‌వీటి రాధా ఆఫీసు ముందు స్కూటీ క‌ల‌క‌లం

టీడీపీ నేత‌ వంగవీటి రాధా ఆఫీస్‌ ముందు కలకలం చెలరేగింది. కొన్ని రోజులుగా ఆఫీసు ముందు అనుమానాస్పదంగా ఓ స్కూటీ ఉంది. తనను చంపడానికి రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధా ఇటీవ‌ల వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా రాధా ఆఫీస్ ముందు కొన్ని రోజులుగా ఓ స్కూటీ పార్క్ చేసి ఉంది. దీనిపై పోలీసులకు రాధా అనుచరులు ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు స్కూటీని స్వాధీనం చేసుకుని, దానికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఆ స్కూటీ నాని అనే వ్యక్తికి చెందినదని గుర్తించారు. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రాధా కార్యాలయం పక్కన వుండే స్వీట్ షాపులో పని చేసే వ్యక్తి స్నేహితుడిగా నానిని గుర్తించారు. వాహనానికి సంబంధించిన పత్రాలను చూపించి తీసుకెళ్లాలని చెప్పారు. ఇటు రాధా కార్యాలయాన్ని ఇంటెలిజెన్స్‌, ఎస్‌బీ పోలీసులు పరిశీలించారు. రాధా కార్యాలయం దగ్గర వివరాలు సేకరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement