Sunday, April 28, 2024

AP – శృంగవరపుకోటలో వైసిపికి భారీ షాక్ – టీడీపీ లోకి 150 మంది ముఖ్య నేతలు

!ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాణి సహా 150మంది వైసిపి ముఖ్యనేతలు టిడిపిలో చేరిక.

పసుపుకండువాలు కప్పి ఆహ్వానించిన లోకేష్. విధ్వంసపాలనతో ప్రజల ఆశలకు జగన్ గండి.

ఉత్తరాంధ్రకు పూర్వవైభవం తెస్తామన్న యువనేత.

మంగళగిరి: ముఖ్యమంత్రి జగన్ ఒంటెద్దు పోకడలు భరించలేక జిల్లాలకు జిల్లాలే వైసిపి పార్టీ ఖాళీ అవుతోంది. ఇక ఆ పార్టీలో ఇమడలేమంటున్న నాయకులు తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్నారు. తాజాగా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సతీమణి సుధారాణి నేతృత్వంలో వివిధస్థాయిల వైసిపి నాయకులు యువనేత లోకేష్ సమక్షాన సోమవారం టిడిపిలో చేరారు. 15మంది సర్పంచులు, 17మంది ఎంపిటిసిలు, 5గురు కన్వీనర్లతో సహా 150మంది పార్టీ ముఖ్యనేతలు సోమవారం భారీకాన్వాయ్ తో ఉండవల్లిలోని చంద్రబాబు వద్దకు నివాసానికి చేరుకున్నారు. వారందరికీ యువనేత లోకేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసం టిడిపితో కలసి పనిచేసేవారికి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పారు. పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చినవారిని కలుపుకొని రాబోయే టిడిపి గెలుపు కోసం కృషిచేయాలని కోరారు.

- Advertisement -

పార్టీలో చేరిన వారిలో ఎస్.కోట ఎంపీపీ సంధి సోమేశ్వరరావు, ఎంపీటీసీ లాగుడు లక్ష్మి, ఎంపీటీసీ మోపాడ గౌరీశ్వరి, ఎంపీటీసీ-1 దారా గిరి, ఎంపీటీసీ-2 మజ్జి దేవి, ఎంపీటీసీ-4 వాకాడ సింహాచలం, ఎంపీటీసీ-5 మోపాడ సునీత, ఎంపీటీసీ-6 బి.ఆదిలక్ష్మి, ఎంపీటీసీ భోజంకి వెంకటలక్ష్మి, మండల కో-ఆప్షన్ మెంబర్ షేక్ బషీర్, సర్పంచ్ లు సోలుబొంగు కనకం, రామకృష్ణ, సంతోషి కుమారి, వొబ్బిన త్రినాథమ్మ, లాగుడు సూర్యనారాయణ, ఎర్ర సన్యాసిరావు తదితరులు ఉన్నారు

.అందరం కలసి అభివృద్ధి చేసుకుందాం: లోకేష్

ఎన్నికల్లో జగన్ ను ప్రజలు నమ్మి 151 సీట్లతో అధికారమిస్తే కోట్లాది ప్రజల ఆశలు, ఆశయాలకు గండికొడుతూ…ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలనను ప్రారంభించారని యువనేత లోకేష్ మండిపడ్డారు. యువగళం పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యాను. వారి కష్ట, సుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తానన్నారు.

ఎస్.కోటను కబ్జాలకోటగా మార్చారు: సుధారాణి

ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నియోజకవర్గాన్ని కబ్జాల కోటగా మార్చేశారని ఎమ్మెల్సీ రఘురాజు సతీమణి సుధారాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన తర్వాత సుధారాణి మాట్లాడుతూ… వైసీపీలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మాకు అక్కడ ఎలాంటి ఆత్మగౌరవం లేదు. మా సమస్యలను జగన్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదు. నియోజకవర్గ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కబ్జాల కడుబండిగా పేరు గడించారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ఇక్కడకు వచ్చాం. ఇక్కడ కార్యకర్తలకు గౌరవం ఉంటుంది. రాబోయే రోజుల్లో చంద్రబాబునాయుడు విజయానికి మనస్ఫూర్తిగా పనిచేస్తాం. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో తమ ప్రాంతం అభివృద్ధి చెందగలదన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తంచేశారు..

ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలితకుమారి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement