Friday, May 17, 2024

దోపిడీ దొంగల హల్‌చల్‌.. 3.70 లక్షల అపహరణ..

అనంతపురం, ప్రభన్యూస్‌ : గొర్రెల వ్యాపారానికి వెళ్తున్న, రైతుల నుంచి వాహనాన్ని అడ్డగించి, 3.70 లక్షల రూపాయలు అపహరించారు. అనంతపురం జిల్లా డి హిరేహాల్‌ మండల సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. డి హిరేహాల్‌ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఎస్‌ రంగాపురం గ్రామం నుండి, కర్ణాటక రాష్ట్రము, రాంపురం గ్రామంలో జరుగు గొర్రెలు సంతకు టాటా ఏస్‌ లగేజి వెహికల్‌లో వెళుతున్న వ్యాపారులను తెల్లవారుజామున సుమారు పది నుండి పన్నెండు మంది దాకా గుర్తు తెలియని వ్యక్తులు ఒక లగేజి బొలెరో వాహనంలో వచ్చి, వ్యాపారులు వెళుతున్న వెహికల్‌ను ఇండియన్‌ గ్యాస్‌ గోడౌన్‌ సమీపంలో ఎన్‌ హెచ్‌ 150 హైవే పైన వెనుక నుండి ఓవర్‌ టేక్‌ చేసి వారిని అడ్డగించి, భయపెట్టి వారి వద్ద వున్న సుమారు రూ.3,71, 000 దోచుకొని కర్ణాటక రాష్ట్రము రాంపురం వైపు వెళ్ళినారు. అని పోలీసులు తెలిపారు బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement