Friday, May 3, 2024

2024లో టీడీపీకి రిటైర్మెంట్ తప్పదు.. అంబటి రాంబాబు

2024లో టీడీపీకి రిటైర్మెంట్ తప్పదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అంబేద్కర్ గుర్తుకు రాలేదన్నారు. అధికారంలో ఉండగా.. సొంత నియోజకవర్గం వారే తప్ప చంద్రబాబుకు వేరే వారు గుర్తుకు రాలేదన్నారు. 2018లో పోలవరం పూర్తి చేస్తానని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాఫర్ డ్యాం పూర్తి చేయకుండానే డయాఫ్రం వాల్ ను ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. పోలవరాన్ని నాశనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement